అక్షయ తృతీయ
శ్లో || "వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అక్షయతృతీయ రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో చందనోత్సవం జరుపుతారు. అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే సింహాచల అప్పన్న నిజరూప దర్శనం కలుగుతుంది. మిగిలిన రోజులలో స్వామివారిని చందనంతో అలకరిస్తారు. అక్షయతృతీయ రోజున స్వామివారికి కొత్తగా చందనాన్ని పూస్తారు. శ్రీనృశింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని అనుగ్రహించింది అక్షయతృతీయ రోజునే అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
మత్స్య పురాణంలోని అరవై ఐదవ అధ్యాయం ప్రకారం, ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయతృతీయ వ్రతం గురించి తెలిపాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసేటటువంటి ఎలాంటి వ్రతమైనా, జపం అయినా, హోమం అయినా, దానాలు ఏవైనా దాని ఫలితం అక్షయం అవుతుంది. అక్షయతృతీయ రోజున తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం చేసి, ఎటువంటి పుణ్య కార్యం చేసినా దానికి సంబంధించిన ఫలితం అక్షయంగానే లభిస్తుంది. అక్షయతృతీయ తిథి రోజున అక్షయుడైన శ్రీమహావిష్ణువు పూజింపబడతారు. అక్షయతృతీయ రోజున ఆక్షతోదకంతో స్నానం చేసి, అక్షతలను శ్రీమహావిష్ణువు పాదాలపై పెట్టి ఆచరించిన తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరొకసారి ఏరి బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన వాటిని దైవ సంబంధిత, బ్రాహ్మణ సంబంధిత ఇష్టంగా తలపోసి వాటిని ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పకుండా కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.
వైశాఖ శుక్ల తదియ రోజున నియమంతో, నిష్ఠతో అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత పన్నెండు మాసాలలో శుక్ల తృతీయ రోజున ఉపవాసం ఉండి విష్ణువును భక్తిపూర్వకంగా అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలుగి అంత్యంలో శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తప్పకుండా గంగా స్నానం చేయాలి అలా కాని పక్షంలో 'ఓం గంగాయై నమః' అని మనసులో జపిస్తూ స్నానం చేయాలి. అక్షయ తృతీయ రోజున మట్టిని పూజించాలి. ఈ రోజు మట్టిని పూజించడం వలన ధనలక్ష్మీ, దాన్యలక్ష్మీ, వైభవలక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలి లేదా ఒక మొక్క నాటాలి అని సంప్రదాయం చెపుతుంది. అక్షయతృతీయ పితృదేవతలకు తర్పణాలు విడిచినట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయతృతీయ రోజున విసినకర్రలు, గొడుగు, నీళ్ళు, గోదానం చేయాలి.
“ అక్షయ తృతీయ” : కుబేర లక్ష్మీ పూజ !
అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ పూజ చేయాలని పండితులు అంటున్నారు. కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి.
అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని పైన పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.
అక్షయ తృతీయ మనం చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పటానికి ముందు నేతి దీపమెలిగించి లక్ష్మీస్తుతి,కనకధార స్తోత్రము చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని పైన పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.
అక్షయ తృతీయ మనం చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పటానికి ముందు నేతి దీపమెలిగించి లక్ష్మీస్తుతి,కనకధార స్తోత్రము చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
"అక్షయ తృతీయ" దానధర్మాలు !
వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.
అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపురంగు చీర లేదా ఎరుపురంగు వస్తువులు అనాధలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది.
అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. అక్షయ తృతీయనాడు పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది.
ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది.ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది.
ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది.ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది.
గోధుమ బియ్యంతో ప్రసాదం :-
అక్షయ తృతీయ నాడు సాంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలిస్తుంది. కుబేరలక్ష్మి, లక్ష్మీ నారాయణన్, లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చును.
అలాగే పుణ్య తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు.
"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే పుణ్య తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు.
"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏
✍️ “ సాంప్రదాయం “
No comments:
Post a Comment