వైశాఖ మాసం ప్రారంభం
మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి.
కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా
పేరుపొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతిదినమూ పుణ్యదినమే.
అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.
సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.
వైశాఖ మాసం విశిష్టత
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది. వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని శ్రీమహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ మాసంలో ఒంటిపూట భోజనం, నక్తం ఆయాచితంగా భుజించడంవైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి. అటువంటి వారు ఉత్తమగతులు పొందుతారు కాబట్టి వైశాఖ మాసం పరమేశ్వరుడికి ధార పాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభఫలితాలు పొందుతారు. రావిచెట్టు మొదళ్ళను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణాలు చేసినవారి పూర్వీకులు అందరూ తరిస్తారు. ఎంతో శ్రేష్ఠమైనదని తెలుపబడింది. వైశాఖ మాసంలో దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని, యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం.
మాసాలలో వైశాఖమాసం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న కారణంగా ఈ మాసాన్ని మాధవమాసమని కూడా పిలుస్తుంటారు. అనేక శుభకార్యాలకు దైవ కార్యాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. పరమపవిత్రమైన ఈ మాసంలోనే పరశురాముడు జన్మించాడు. దశావతారాలలో పరశురాముడి అవతారానికి ఒక ప్రత్యేకత వుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరశురాముడు, అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి ఆయా క్షేత్రాల అనుగ్రహం భక్తులకు లభించేలా చేశాడు.
శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.
వైశాఖ మాసం- వైశాఖ స్నానం- వైశిష్ట్యం
మనము -వైశాఖ స్నానం-వైశాఖ వైశిష్ట్యం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం :-
స్నానము ఎప్పుడు చేసినా ఎలా చేసినా శరీర మలినాలను తొలగించుకునే మార్గాలలో ఒకటి. ఆది మానవుడు ఆచరించడానికి స్నానానికి దైవత్వాన్ని మిలితం చేసి మన పూర్వికులు మనకందించిన ఆత్యాద్మిక ఆరోగ్యసూత్రాలే ఈ స్నానవ్రతాలు .
సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.
సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు.
జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.
యోవై దేవాన్పితౄ న్విష్ణుం గురు ముద్దిశ్య మానవ: |
నస్నానాది కరోత్యద్ధా ముప్యశాప ప్రదా వయమ్ ||
నిస్సంతానో నిరాయుశ్చ నిశ్శ్రేయస్కో భవేదితి |
ఇతి దేవా వరం దత్త్వా స్వధామాని యయు: పురా ||
తస్మాత్తిథి త్రయం పుణ్యం సర్వాఫ°ఘ వినాశనమ్ |
అంత్యంపుష్కరిణీ సంజ్ఞం పుత్రపౌత్రాది వర్థనమ్ ||
యా నారీ సుభగా పూపపాయసం పూర్ణిమా దినే |
బ్రాహ్మణాయ సకృద్దద్యాత్ కీర్తిమంతం సుతం లభేత్ ||
గీతా పాఠంతు య: కుర్యాత్ అంతిమేచ దినత్రయే |
దినే దినేశ్వమేధానాం ఫలమేతి నసంశయ: ||
దేవతలను, పితురులను, విష్ణువును, గురువునుద్దేశించి స్నానాదికములను చేయనివానికి మేము శాపమును ఇచ్చెదము. సంతానము లేనివానిగా, ఆయుష్యము లేనివానిగా, శ్రేయస్సు లేని వానిగా కమ్మని శాపమును ఇచ్చెదము. ఇట్లు దేవతలు వరములను ఇచ్చి తమ తమ నెలవులకు వెళ్ళిరి. కావున ఈ తిథిత్రయము పుణ్యము.
సర్వపాప సమూహములను నశింపచేయునది. ఈ తిథి త్రయము అంత్యము పుష్కరిణీ అనబడును. పుత్రపౌత్రులను వృద్ధి పొందించును. పూర్ణిమా దినమున అపూప పాయసములను చేయు సౌభాగ్యవతి ఒకసారి బ్రాహ్మణునకు ఆ అపూపపాయసాదికముల నిచ్చినచో కీర్తిమంతుడైన పుత్రుడు కలుగును. ఈ అంతిమ దిన త్రయమున గీతా పాఠమును చేసినచో ప్రతి దినమున అశ్వమేధ ఫలము లభించును.
వైశాఖమాసంలో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందుకే వైశాఖ మాసంలో చలివేంద్రాలు కట్టించి, దాహమేసిన వారికి దాహము తీర్చిన సమస్త పాపాలూ నశిస్తాయ్. దప్పిక తీర్చుటకు జలం గానీ, ఎండకు గొడుగును గానీ, పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రను గానీ దానమిస్తే సమస్త పాపాలూ తొలిగిపోతాయట. వైశాఖ మాసం ఆరంభం కాగానే ఒక బీద బ్రాహ్మణునకు కలశం నిండా జలం పోసి దానం చేసి నమస్కరిస్తే అన్ని దానాల కన్నా ఈ దానం మిక్కిలి ఫలము పొందుతాడు. ఈ మాసంలో ఒక బ్రాహ్మణుడికి గొడుగును దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషించి సకలైశ్వర్యాలూ ఇస్తాడు.
సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు.
వైశాఖమాసం- వ్రతం- ఆచరణం
వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు :
🔶 వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.
🔶 విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.
🔶 అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.
🔶 గళంతిక ఆరాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నెలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.
🔶 వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.
వైశాఖ మాసంలో ఏవి దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది?
💠 మామిడిపళ్ళు పితృదేవతలు సంతోషిస్తారు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
💠 పానకం కుండ పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది.
💠 దోస, బెల్లం, చెరుకు సర్వపాపాలు నశిస్తాయి.
💠 మంచం సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.
💠 వస్త్రాలు ఆయుష్షు వృద్ధి, ముఖ్యంగా తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు పొంది అంత్యంలో ముక్తిని పొందుతారు.
💠 కుంకుమ స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
💠 గంధం తరచుగా ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకోగలరు
💠 తాంబూలం అధిపతులు అవుతారు.
💠 కొబ్బరికాయ ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు
💠 మజ్జిగ సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి కలుగుతుంది.
💠 చెప్పులు నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది.
💠 గొడుగు సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు.
💠 ఫలాలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
💠 బియ్యం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది.
💠 ఆవునెయ్యి అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు. పితృదేవతలకు వదిలినవారికి దారిద్ర్య బాధ ఉండదు.
💠 అన్నదానం విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందుతారు.
💠 పెరుగు అన్నం చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది.
వైశాఖ శుద్ధ తదియ - అక్షయ తృతీయ
తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే.
వైశాఖ శుద్ధ తదియ - సింహాచల చందనోత్సవం
ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు.
వైశాఖ శుద్ధ తదియ - బలరామ జయంతి
ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు.
వైశాఖ శుద్ధ తదియ - పరశురామ జయంతి
తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు.
వైశాఖ శుద్ధ పంచమి - ఆది శంకరాచార్య జయంతి
పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ళను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.
వైశాఖ శుద్ధ షష్టి - రామానుజ జయంతి
ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.
వైశాఖ శుద్ధ సప్తమి - గంగావతరణం
తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు.
వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహినీ ఏకాదశి
ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.
వైశాఖ శుద్ధ చతుర్దశి - శ్రీనృసింహజయంతి
తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.హిరణ్యకశిపుడిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ దినం ఉపవాసంను పాటించి స్వామివారిని పూజించడం లేదా స్వామివారి వ్రతం చేయడంతో పాటు స్వామివారు ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు.
వైశాఖ పూర్ణిమ - మహావైశాఖి
వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.అలాగే హిరణ్యకశిపుడిని అంతమొందించి ఉగ్రరూపంలో తిరుగుతూ ఉండిన నృసింహస్వామి ఉగ్రరూపాన్ని తొలగించేందుకు శివుడు శరభుడిగా అవతరించిన దినమూ ఇదే.
వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజు ఆంజనేయస్వామి వారిని సింధూర, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను ధరింపచేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవలెను.
ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి.
గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టమైన ఈనాడు సముద్రస్నానం చేయడం విష్ణువును పూజించడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి ఈ దినం ఉన్నతమైనది. అలాగే శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ, కూర్మజయంతి,నారద జయంతులు కూడా వైశాఖంలోనే కావడం ఈ మాస విశిష్టత. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులన్నీ ఆరోగ్యరహస్యాలు కావడం విశేషం. బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు.ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి. ఇక కార్తీక మాసం. మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది.
తతస్సతు మహాతేజా: శ్రుతదేవో మహాయశా: |
సంతుష్ట: పరమప్రీత: యయౌ ధామస్వకం ముని: ||
త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం చ మాధవే |
స్నానం దానం పూజనంచ కథాశ్రవణమేవచ ||
వైశాఖ ధర్మనిరత: సవై మోక్షమవాప్నుయాత్ |
ధనశర్మా బ్రాహ్మణశ్చ ప్రేతశ్చైవయధాపురా ||
నారద ఉవాచ – నారదుడు పలికెను
ఇత్యేతత్పర మాఖ్యానం అంబరీస తవోదితమ్ |
శ్రవణాత్సర్వ పాపఘ్నం సర్వసంపద్విధాయకమ్ ||
తేన భుక్తించ ముక్తించ జ్ఞానం మోక్షం చ విందతి |
ఇతి తస్య వచశ్శ్రుత్వా అంబరీషో మహాయశా: ||
ప్రహృష్ణాంతర వృత్తిశ్చ బాహ్య వ్యాపారవర్జిత: |
ప్రణనామ తతో మూర్ధ్నా దండవత్పతితో భువి ||
అంతట మహాతేజస్వి అయిన మహాయశస్వి అయిన శ్రుతదేవుడు సంతోషించి మరమప్రీతిని చెంది తన ఇల్లును చేరుకొనెను. త్రయోదశినాడు చతుర్దశనాడు పూర్ణిమనాడు వైశాఖ మాసమున స్నానము దానము పూజనము కథాశ్రవణములను చేయుచు వైశాఖ ధర్మనిరతుడైనవాడు మోక్షమును పొందును. ధనశర్మ బ్రాహ్మణుడు, ప్రేత కూడా మోక్షమును పొందియున్నారు. ఇలా చెప్పిన నారదుడు అంబరీషునితో ఇట్లు అంటున్నాడు. వినుట వలన అన్ని పాపములను నశింపచేయునది, సకల సంపదలను అందించునది. అట్టివాడు భుక్తిని, ముక్తిని, జ్ఞానమును, మోక్షమును పొందును. ఇట్లు నారదమహర్షి మాటలను వినిన మహాయశస్వి అయిన అంబరీషుడు అంతరంగమున సంతోషప్రవృత్తి కలవాడై బాహ్య వ్యాపారములను విడిచినవాడై భూమిపై దండము వలె పడి శిరస్సు వంచి నమస్కరించెను.
🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏
✍️ “ సాంప్రదాయం “